భారతదేశం, మే 24 -- ొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ పరోటా, రోటీ వంటి వంటకాలతో ఉచిత గ్రేవీని అందిస్తాయి. కొన్ని రెస్టారెంట్లలో మీరు పరోటా, రోటీలతో పాటు గ్రేవీని విడిగా కొనుగోలు చేయాలి. కచ్చితంగా వాటికి డబ్బులు చెల్లించి తీసుకోవాలి. ఇది ఆయా హోటళ్ల రూల్. కానీ ఇప్పుడు ఈ విషయంపై వినియోగదారుల కోర్టులో కీలక తీర్పు వచ్చింది.

రెస్టారెంట్లు తమ వద్దకు వచ్చే కస్టమర్లకు పరోటాతో ఉచిత గ్రేవీని అందించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ వినియోగదారుల వ్యవహారాల కోర్టు ఒక ముఖ్యమైన ఉత్తర్వును జారీ చేసింది. కొచ్చిలోని పర్షియన్ టేబుల్ అనే రెస్టారెంట్ యజమాని గత ఏడాది నవంబర్ నుండి ఉచిత గ్రేవీకి సంబంధించి వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. పరోటా - గ్రేవీ కేరళలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. అందుకే ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

కోర్టు ముందు తన రెస్టారెంట్...