భారతదేశం, మే 28 -- అమరావతి: ఇటీవల విడుదలైన పదో తరగతి (SSC March 2025) పరీక్షల ఫలితాల రీకౌంటింగ్‌లో తప్పులు జరిగినట్లు వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రీకౌంటింగ్ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం మే 28, 2025న ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను జూన్ 1, 2025 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

పదో తరగతి మార్కుల రీవెరిఫికేషన్ కోసం 64,251 దరఖాస్తులు, రీకౌంటింగ్ కోసం 2,112 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణలో, మూల్యాంకనం సమయంలో మార్కుల నమోదులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వరుసలను చేర్చకపోవడం వల్ల ఈ తప్పులు జరిగినట్లు గుర్తించారు.

రీకౌంటింగ్ సమస్యల కారణంగా IIIT (ట్రిపుల్ ఐటీ)...