భారతదేశం, మే 16 -- తమిళనాడు కోయంబత్తూరు జిల్లాకు చెందిన కవల సోదరీమణులు కవిత, కనిక తాజాగా విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో 93.80 శాతం సమాన మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. వారు రామనాథపురానికి చెందిన సుందరరాజన్, భారతి సెల్వి దంపతుల కుమార్తెలు. రామనాథపురం మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు.

ఈ కవల సోదరీమణులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ఒకే మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పరీక్ష ఫలితాలు చెక్ చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరూ రిజల్ట్ చూసి షాక్ అయ్యారు. కొన్ని నిమిషాలు నివ్వెరపోయారు. దీనికి కారణం వారిద్దరికీ ఒకే స్కోరు రావడమే.

కవిత మార్కులు ఈ కిందది విధంగా ఉన్నాయి. తమిళం - 95, ఇంగ్లీష్ - 98, గణితం - 94, సైన్స్ - 89, సోషల్ సైన్స్ - 98, మొత్తం 474 మార్కులు.

కనిక మార్కులు చూసుకుంటే తమిళం - 96, ఇంగ్లీష్ - 97, గణితం - 94, సైన్స్ - 92, సోషల్ ...