భారతదేశం, మే 2 -- అనతంపురం జిల్లా బెళుగుప్ప మండలంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను.. విమాన ప్రయాణం చేయిస్తానని ఎంఈఓ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలో ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్య అనే విద్యార్థినులు 550కిపైగా మార్కులు సాధించారు.

తాజాగా ఎంఈఓ విద్యార్థినులతో వెళ్లి కలెక్టర్‌ వినోద్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి అనుమతి తీసుకున్నారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు వస్తారు. భాగ్యనగరంలో పర్యాటక ప్రదేశాలను విద్యార్థినులకు చూపించి తీసుకువస్తానని ఎంఈఓ వివరించారు. దీనికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. ఎంఈవో నిర్ణయాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

ఏపీ పద...