భారతదేశం, మే 1 -- ర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్‌లో ఐదు సీసాల మద్యం తాగి 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. కార్తీక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి నీరు కలపకుండా మద్యం తాగవచ్చని 10,000 రూపాయలు పందెం వేశాడు. ఐదు ఫుల్ బాటిళ్లు తాగిన తర్వాత కార్తీక్ అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, కానీ చికిత్స ఫలించకపోవడంతో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదైంది.

21 ఏళ్ల కార్తీక్ స్నేహితులతో కలిసి రూ.10,000 పందెం వేశాడు. దానికోసం అతను మద్యంలో నీటిని కలపకుండా నేరుగా ఐదు బాటిళ్ల తాగుతానని చెప్పాడు. తన స్నేహితులకు నీటిలో కలపకుండా ఐదు సీసాల మద్యం తాగవచ్చని తెలిపాడు. వెంకట రెడ్డి అనే స్నేహితుడు కార్తీక్ అలా మద్యం తాగితే రూ.10,000 రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు.

తాను ఎప్పుడూ మద్యం తాగడంలో విఫలం కాలేదని, నీరు కలపకుండా 5 బాటిళ్ల మ...