భారతదేశం, డిసెంబర్ 12 -- ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో మెప్పిస్తోన్నఓటీటీ సంస్థల్లో జీ5 ఒకటి. ఇండియాలో అతిపెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా అవతరిస్తోన్న జీ 5 మ‌రోసారి త‌న‌దైన శైలిలో విల‌క్ష‌ణ‌మైన తెలుగు ఒరిజిన‌ల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంది.

అదే 'న‌య‌నం'. హీరో వ‌రుణ్ సందేశ్‌, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ నయనం ఓటీటీ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు.

ఈ ఒరిజిన‌ల్ సిరీస్ నయనం జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నయనం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ స్వాతి ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశార...