భారతదేశం, మే 8 -- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న తరువాత రెండు వారాలకు భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. భారత దేశం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచింది.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో పాలన యంత్రాంగం స్కూళ్లను మూసివేయాలని ఆదేశించింది. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్ మరియు గురుదాస్‌పూర్‌లలో బుధవారం అన్ని స్కూళ్లు మూసిశారు. పఠాన్‌కోట్‌లో స్కూళ్లు రాబోయే 72 గంటల పాటు మూసిఉంటాయి. ఫిరోజ్‌పూర్‌లో గురువారం, శుక్రవారం కూడా స్కూ...