భారతదేశం, మే 26 -- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు ముందు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..టీడీపీ నేతతో భేటీ అయ్యాయని వైసీపీ సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసింది. ఈ వివాదంపై విజయసాయి రెడ్డి స్పందించారు.

"నేను మౌనంగా ఉండడం వైసీపీలోని కోటరీకి నచ్చటం లేదు. అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ కు నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు.

రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ కు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుం...