Hyderabad, జూన్ 6 -- మలయాళం మూవీ పాత్ (Pattth) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది 29వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ఈ మూవీని ప్రదర్శించారు. జితిన్ ఐజాక్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

మలయాళం మూవీ పాత్ శుక్రవారం (జూన్ 6) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయలేదు. డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న మనోరమ మ్యాక్స్ ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది.

ఈ మూవీ కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. మూవీకి ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన పాజిటివ్ రివ్యూలతో ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ...