Hyderabad, మే 30 -- ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో "థగ్ లైఫ్" ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో మే 29న గ్రాండ్‌గా నిర్వహించారు. థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైజాగ్ గురించి, తెలుగు ప్రేక్షకుల గురించి, సినిమాలపై హీరో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారాలు. వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా ...