భారతదేశం, మే 16 -- ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతుగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం సాయంత్ర భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. భారత సైన్యానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

తిరంగా ర్యాలీ సందర్భంగా నగరంలో శుక్రవారం సాయంత్రం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఈ మళ్లింపులు ఉంటాయని విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. ఆంక్షలను గమనించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పహల్గామ్‌లో భారతీయులపై పాకిస్థాన్‌ ఉగ్రవాదుల దాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్‌పై చేసిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయం కావాడాన్ని కీర్తిస్తూ విజయవాడ నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

16వ తేదీ సాయంత్రం ఐదు వేల మందితో తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నారు. ర్యాలీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ...