Hyderabad, జూన్ 9 -- ప్రముఖ రాజకీయ నాయకుడు, క్రికెట్ కామెంటేటర్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తిరిగి 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కు 'శాశ్వత అతిథి'గా రాబోతున్నాడు. దీంతో అర్చన పూరణ్ సింగ్ తన జడ్జి స్థానాన్ని అతనితో పంచుకోవాల్సి వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షోకు సిద్ధూ రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, గతంలో కపిల్ మొదటి వెరైటీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్'లో అతడు ప్రముఖంగా కనిపించాడు.

నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన కొత్త సీజన్ ప్రోమోలో, కపిల్ శర్మ అర్చనకు ఒక పెద్ద సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ఆట పట్టించాడు. సిద్ధూ వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యల కారణంగా షో నుండి వైదొలిగిన తర్వాత.. అర్చన ఆయన స్థానంలోకి వచ్చింది. ఈసారి నవజ్యోత్ తిరిగి వస్తున్నాడని తెలియగానే ఆమె దాదాపు స్పృహ కోల్పోయినంత పని చేస్తుంది.

కపిల్ ఆమెను హెచ్చరిస్తూ.. "ఇకపై సిద్ధూ ఆమెను...