భారతదేశం, మే 3 -- నీట్ యూజీ 2024 పరీక్షలో జరిగిన అక్రమాలపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కఠిన చర్యలు తీసుకుంది. పరీక్షలో అక్రమాలకు పాల్పడినందుకు 26 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను కమిషన్ సస్పెండ్ చేసింది. 14 మంది విద్యార్థుల అడ్మిషన్‌ను కూడా రద్దు చేసింది. 26 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను తక్షణమే సస్పెండ్ చేయాలని సంబంధిత వైద్య కళాశాలలు, విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అంతర్గత దర్యాప్తు తర్వాత ఈ విద్యార్థులను గుర్తించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త అడ్మిషన్లను కూడా కమిషన్ సమీక్షించింది.

ఎన్ఎంసీ జరిపిన దర్యాప్తులో నీట్ యూజీ 2024 పరీక్షలో మరో 14 మంది విద్యార్థులు కూడా తప్పుడు మార్గాలను అవలంబించారని తేలింది. ఈ విద్యార్థుల ప్రవేశం కూడా క్యాన్సిల్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి మోసం, ఫోర్జరీ లేదా పేపర్ లీకేజీని నివారించడానికి క...