Hyderabad, జూన్ 27 -- 2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.

అలాగే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది కమిటీ కుర్రోళ్లు. అంతేకాకుండా మూవీ డైరెక్టర్ యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా గద్దర్ అవార్డ్ వచ్చింది.

తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన సక్సెస్‌ఫుల్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్‌ నుంచి ఇప్పుడు రెండో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున...