భారతదేశం, మే 27 -- నిన్ను కోరి సీరియల్ నేటి (మే 27) ఎపిసోడ్‍లో.. ఏసీ కూల్ తగ్గించడానికి విరాట్ ట్రై చేస్తాడు. కానీ రిమోట్‍లో సెల్స్ ఉండవు. తంటాలు పడతాడు. నా దగ్గర ఉన్నాయని చంద్రకళ అంటుంది. విరాట్‍ను సరదా పట్టిస్తుంది. దుప్పటి లాక్కుంటూ ఇద్దరూ పోటీ పడతారు. ఒకే దుప్పటి కప్పుకొని పడుకుంటారు. విరాట్ వంక ప్రేమగా చూస్తూ మీద చేయి వేస్తుంది చంద్ర. విరాట్ చిరాకు పడతాడు.

రాత్రంతా నేల మీద పడుకునే సరికి ఒళ్లు నొప్పులుగా ఉందని, అంతా ఆయన వల్లే అంటూ చంద్రకళ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కిచెన్‍లోకి కామాక్షి, శృతి వస్తారు. ఏంటి అలా ఉన్నావని అడుగుతాడు. సోఫా మీద పడుకోలేదు.. అందుకే ఒళ్లు నొప్పులు అని చంద్ర అంటుంది. అంటే విరాట్‍తో మంచం మీద పడుకున్నావా అని కామాక్షి అడుగుతుంది. నీకు అంత సీన్ లేదు.. విరాట్ నిన్ను దగ్గరికి కూడా రానివ్వడని శృతి అంటుంది. బావే నా దగ్గరి...