భారతదేశం, మే 26 -- నిన్ను కోరి సీరియల్ నేటి మే 26వ తేదీ ఎపిసోడ్‍లో.. మామయ్య రఘురాం గది దగ్గరికి చంద్రకళ వస్తుంది. మంచంపై ఉన్న రఘురాంకు చెమటలు పట్టడాన్ని చంద్ర గమనిస్తుంది. అత్తయ్య ఇక్కడ లేనట్టు ఉన్నారని అనుకుంటుంది. ఏసీ పని చేయలేదని చూస్తుంది. దీంతో ఫ్యాన్ ఆన్ చేస్తుంది. రఘురాం ముఖానికి చెమట తుడుస్తుంది. మీరేమే మీ ఇబ్బందులు చెప్పుకోలేరు.. ఎంత కష్టంవచ్చిందని చంద్ర బాధపడుతుంది. కొంగుతో గాలి విసురుతుంటుంది.

రఘురాం దగ్గర చంద్రకళ ఉండడాన్ని చూసి జగదీశ్వరి ఆగ్రహిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాదా.. అసలు నువ్వు మనిషివేనా అని తిడుతుంది. ఈ రూమ్‍లోకి రావొద్దని మళ్లీమళ్లీ మొత్తుకున్నా ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. మామయ్యకు చెమటలు పట్టేసి ఉంటే.. ఫ్యాన్ వేసేందుకు వెళ్లానని అంటుంది. ఇంతలో జగదీశ్వరిని రెచ్చగొడతారు శాలినీ, శృతి, కామ...