Hyderabad, మే 9 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి ఇంట్లో అవమానం జరిగిన తర్వాత చంద్రకళ గుడికి వెళ్తుంది. రఘురాం మావయ్య కోలుకోవాలని, అలాగే విరాట్ బావతో పెళ్లి జరగాలని మనసులో కోరుకుంటుంది చంద్రకళ. మనసులోని కోరికలు నెరవేరాలంటే గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలని పంతులు సలహా ఇస్తాడు. కానీ, ఒక్కసారి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాక ఏం జరిగిన ఆపకూడదు. అరిష్టం. కోరుకున్నవి జరగవు అని పంతులు హెచ్చరిస్తాడు.

దాంతో అలాగే అని చంద్రకళ చేస్తుంది. గుడి చుట్టూ చంద్రకళ 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంతలో అదే గుడికి విరాట్ ఫ్యామిలీ వస్తుంది. రఘురాం కోలుకోవాలని గుడిలో విరాట్ కుటుంబం యజ్ఞం జరిపిస్తుంది. అక్కడ చంద్రకళని శృతి శాలిని కామాక్షి చూస్తారు. ప్రదక్షిణలకు భంగం కలిగిస్తే అరిష్టం అని చంద్రకళ చేస్తున్న ప్రదక్షిణలకు భంగం కలిగించాలని ప్లాన్ ...