Hyderabad, మే 8 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం మావయ్య జీవచ్ఛంలా ఉండటానికి కారణం పెద్దనాన్నే. మనం ఏం చేయలేదు. జరిగింది అంతా అత్తయ్యతో, విరాట్ బావతో నిజం చెబుతానని సుభద్ర, సౌజన్య, బామ్మకు చెబుతుంది చంద్రకళ. దాంతో వాళ్లు జగదీశ్వరి ఇంటికి చంద్రకళను నిజం చెప్పడం కోసం పంపిస్తారు.

జగదీశ్వరి ఇంటికి వెళ్లిన చంద్రకళను అంతా విడ్డూరంగా చూస్తారు. జగదీశ్వరి ఇంట్లో ఎవరు కూడా చంద్రకళతో మాట్లాడరు. ఇక ఇంటికి వచ్చిన చంద్రకళపై కామాక్షి రగిలిపోతుంది. నానా మాటలు అంటుంది. విరాట్ బావతో మాట్లాడాలి, జగదీశ్వరి అత్తయ్యకు నిజం చెప్పాలి అని చంద్రకళ అంటుంది. కానీ, ఇంకా ఏం చెబుతావ్. మాకు ఎలా నమ్మకద్రోహం చేశారో చెబుతావా అని శృతి, శాలిని, కామాక్షి అంటారు.

అయినా చంద్రకళ అత్తయ్యతో మాట్లాడాలని మొండిగా ప్రవర్తిస్తుంది. అదంతా మేడ పై నుంచి జగదీశ్వరి, విరాట్ చూ...