Hyderabad, మే 5 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వర్‌ను విరాట్ ఓదార్చి ఐసీయూ నుంచి తీసుకెళ్తాడు. రఘురాంను డాక్టర్ చూస్తుండగా.. సైలెంట్‌గా శ్రీరాజ్ తప్పించుకుంటాడు. వరదరాజులును కూడా డాక్టర్ పంపిస్తుంది. డాక్టర్ వచ్చి రఘురాం ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఆయనకు స్పృహ అయితే వచ్చింది కానీ, నిలబడలేడు, మాట్లాడలేడు. బ్రెయిన్‌లో సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిందని చెబుతాడు.

అన్ని వినపడతాయ్, కనపడతాయ్. స్పృహలోనే ఉంటారు కానీ దేనికి స్పందించలేరు. రికవరీ గురించి చెప్పడం కష్టం. ఇలాంటి పేషంట్స్ కోలుకోవడం కుదరదు. మీ అదృష్టం బాగుంటే కోలుకుంటారు అని డాక్టర్ చెబుతాడు. అంటే, నా భర్త జీవచ్ఛవంలా పడి ఉంటారని చెబుతున్నారా డాక్టర్ అని జగదీశ్వరి అంటే అవును అని డాక్టర్ చెబుతాడు. దాంతో జగదీశ్వరి కుప్పకూలిపోతుంది.

వరదరాజులు వచ్చి ఓదారుస్తాడు. అన్నయ్...