Hyderabad, మే 31 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో చంద్రకళ పూజ చేస్తుంది. రఘురాంని హాల్లోకి క్రాంతి తీసుకొస్తాడు. రఘురాంకు హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది చంద్రకళ. మామయ్య గారెకి మందులు వేసే టైమ్ అయిందిగా వేశావా అని క్రాంతిని అడుగుతుంది చంద్రకళ. ఇంతలో క్రాంతికి కాల్ వస్తే వెళ్లమని చెప్పి తాను మందులు వేస్తానని అంటుంది చంద్రకళ.

ఆ మాటలు శాలిని వింటుంది. మీకు ఎలాగైనా నయం కావాలని ఆయుర్వేద మందులు తీసుకొచ్చాను. దీనివల్ల త్వరగా కోలుకోవాలి, కోలుకుంటారని నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టండి అని ఆ మందులు ఇస్తుంది చంద్రకళ. అదంతా చూసిన శాలిని ఆ మందులను మార్చేసింది గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నువ్ మావయ్యకు ఇచ్చిన మందులు ఆ గురూజీ ఇచ్చినవి కాదు. నేను పెట్టిన డూప్లికేట్ మందులు అని శాలిని అనుకుంటుంది.

అవి మావయ్య ఆరోగంగా చేయడం కాదు ఇంకా పాడు...