Hyderabad, మే 1 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాజ్‌ను చంద్ర కలవడంపై ఇంట్లో గొడవపెడతారు. కాబోయే శ్రీవారికి జ్వరం అని తెలియగానే వెల్లి పాద సేవ చేసింది అని శ్రీరాజ్ అంటాడు. సంజాయిషీలు సమర్థింపులు చాలు. ఇక మనకి వాళ్లకు సరిపడదని నా అభిప్రాయం. మనం తిరిగి ఊరేళ్లిపోవడమే దీనికి పరిష్కారం అని వరదరాజులు అంటాడు.

దాంతో చంద్రకళ షాక్ అవుతుంది. వాళ్లు తెంచుకుని వెళ్లిపోతారని ఎన్నిసార్లు అని భరిస్తాం అమ్మ అని మరోవైపు తల్లితో అంటాడు విరాట్. ఆ భయంతో వాళ్లకు అన్ని తెలిసి చేస్తున్నారేమో అనిపిస్తుందని క్రాంతి అంటాడు. దాంతో విరాట్ తల్లి వారిస్తుంది. నీకు ఉన్నది ఆవేశం ఒక్కటే. ఇదంతా శ్రీరాజ్ తన ఆవేశంతో చేశాడా వ్యాపారం దెబ్బతీయాడని చేశాడా. నువ్వేం నమ్ముతున్నావ్ చెప్పు అని తల్లి అంటుంది.

ఆరోజు వరదరాజులు మారాడని నువ్వు నమ్మావనే కదా ఇక్కడికి వచ్చింది అన...