భారతదేశం, జూన్ 3 -- నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 3) ఎపిసోడ్‍లో పెద్దోడి పెళ్లికి కూడా నన్ను పిలవలేదు కదా అని బాధగా జగదీశ్వరిని అడుగుతుంది భీమవరం శ్యామల. మమ్మల్నే పిలవలేదని వెటకారంగా అంటుంది కామాక్షి. నేను వచ్చా కదా.. మా అన్నయ్య రఘురాం లేచి ఎగిరి గంతేలా చేస్తానని శ్యామల చెబుతుంది. అంతా గందరగోళంగా అయిందని, అందుకే నీదాక ఈ విషయం రాలేదని జగదీశ్వరి సర్దిచెబుతుంది. ఇంతలో చంద్రకళ అక్కడికి వస్తుంది. లోపలికి వచ్చి మీ ఆయన పక్కన నిలబడు అని శ్యామల చెబుతుంది.

విరాట్ చంద్రను పెళ్లి చేసుకోవడం అత్తయ్యకు ఇష్టం లేదని శృతి చెప్పాలనుకుంటే.. జగదీశ్వరి అడ్డుకుంటుంది. అమ్మా చంద్ర.. లోపలికి రా అని పిలుస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. శ్యామల కాళ్లకు చంద్ర నమస్కరిస్తుంది. చంద్రుడిలో ఉన్న కళే నీలో ఉందని చంద్రను పొగిడేస్తుంది శ్యామల. విరాట్‍కు పెళ్లయిందని తన వా...