Hyderabad, జూన్ 9 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళకు తల్లిగా భీమవరం శ్యామల పుస్తెల తాడు తెప్పిస్తుంది. దాంతో చంద్రకళ చాలా ఎమోషనల్ అవుతుంది. వెళ్లి శ్యామలను హగ్ చేసుకుంటుంది. అది చూసి జగదీశ్వరి కూడా ఎమోషనల్ అవుతుంది. ఏమైందమ్మా. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్. నీకు ఎవరు లేరనుకోకు. నేనున్నాను అని శ్యామల అంటుంది.

నా పుట్టింటివాళ్లు లేని లోటు తీర్చారు. మీరు నాకు మా అమ్మలాగే కనిపిస్తున్నారు పిన్నిగారు. మీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు అని చంద్రకళ అంటుంది. అసలు తల్లి ప్రేమను పంచే అదృష్టమే నాకు లేదనుకున్నా. నీ వల్ల నాకు అనుభూతి దొరికినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని శ్యామల అంటుంది.

వదినా నీ కొడుకు గొప్ప అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. చంద్రను చూస్తుంటే నిన్ను చూస్తున్నట్లే ఉంది. పుట్టింటికి దూరమైన బాధ నీకు తెలుసు. ...