Hyderabad, జూన్ 20 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రెండో కార్యంలో విరాట్ వాటర్ తాగుతూ చంద్ర నడుము చూసి సోఫాపై నీళ్లు పడేలా చేస్తాడు. దాంతో బెడ్ మీద పడుకుంటానని పడుకుంటుంది చంద్రకళ. విరాట్ కూడా అదే బెడ్‌పై మరోవైపు పడుకుంటాడు. మరోవైపు శ్రుతి వాళ్ల గదిలోకి శ్యామల రావడం చూసి కామాక్షిని లేపుతుంది. గురక సౌండ్ తట్టుకోలేమని అనుకుంటారు.

దాంతో మనమే లాక్ వేసుకుని నిద్రపోయినట్లు చేస్తే రాకుండా వెళ్లిపోతుందని కామాక్షి చెప్పడంతో డోర్ లాక్ వేస్తుంది శ్రుతి. నేను వస్తానని తెలిసి ఎందుకు లాక్ చేసుకున్నారని శ్యామల పిలిస్తుంది. కానీ, తల్లీకూతుళ్లు పలకరు. చెబుతా మీ సంగతి అని దోమల స్ప్రే తీసుకొచ్చి కిటికీ లోనుంచి గదిలోకి కొడుతుంది శ్యామల. దోమల స్ప్రే వాసన తట్టుకోలేక కామాక్షి, శ్రుతి లేస్తారు. ఊపిరాడక విలవిల్లాడుతారు.

ఊపిరి ఆడక వెళ్లి డోర్ తీస్తారు శ్...