Hyderabad, మే 4 -- నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో హాస్పిటల్‌లో రఘురాంను వార్డ్ బాయ్ గెటప్‌లో చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు శ్రీరాజ్. కానీ, ఎవరు మాట వినకుండా జగదీశ్వరి ఐసీయూలోకి రావడంతో పక్కన ఉన్న కర్టెన్స్ వైపు దాక్కుంటాడు. ఐసీయూలోకి జగదీశ్వరుతోపాటు విరాట్, వరదరాజులు కూడా వస్తారు.

రఘురాంను చూసి జగదీశ్వరి కుమిలిపోతుంటుంది. శ్రీరాజ్ ఎక్కడున్నాడో చూసిన వరదరాజులు దొరకలేదని ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మకు సర్దిచెప్పి బయటకు తీసుకెళ్లమని వరదరాజులు అంటాడు. తల్లి జగదీశ్వరిని విరాట్ ఓదార్చుతుంటాడు. కానీ, జగదీశ్వరి మాట వినదు. ఇంతలో డాక్టర్ వచ్చి ఇక్కడ ఇంతమంది ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. పేషంట్‌ను డిస్టర్బ్ చేయకండి అని అందరిని బయటకు పంపిస్తాడు.

తర్వాత కాసేపటికి రఘురాం కోమాలోకి వెళ్లిపోయినట్లు డాక్టర్‌కు తెలుస్తుంది. ఆ విషయం ఇంట్లో...