భారతదేశం, జనవరి 20 -- "సక్త్ లౌండా"గా (Sakht Launda) యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టాండ్-అప్ కమెడియన్ జాకీర్ ఖాన్ తన అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. తన కామెడీ ప్రదర్శనలకు చాలా కాలం పాటు విరామం ప్రకటించారు. ప్రస్తుతం తన 'పాపా యార్' టూర్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన షోలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్లోని ఆడిటోరియం కిక్కిరిసి ఉండగా కమెడియన్ జాకీర్ ఖాన్ మైక్ పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. "నా ఆరోగ్యాన్ని చూసుకోవడానికి, కొన్ని వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడానికి నేను 3, 4 లేదా 5 ఏళ్లు బ్రేక్ తీసుకుంటున్నాను. అంటే నేను మళ్లీ 2028, 2029 లేదా 2030లో తిరిగి రావచ్చు. ఈ రోజు ఇక్కడ ఉన్న మీరందరూ నాకు చాలా ప్రత్యేకం. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.