భారతదేశం, మే 19 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిధులు సమకూరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇండ్లనిర్మాణ ప‌నులు పూర్తయిన మేర‌కు ప్రతి సోమ‌వారం నిధులు విడుద‌ల చేస్తున్నామ‌న్నారు. బేస్మెంట్ పూర్తిచేసుకున్న 1383 ఇండ్లకు, గోడ‌లు పూర్తయిన 224 ఇండ్లకు సోమ‌వారం నాడు 16.07 కోట్ల రూపాయిల‌ను విడుద‌ల చేసినట్లు చెప్పారు.

మొత్తంగా ఇప్పటి వ‌ర‌కు బేస్మెంట్, గోడ‌లు పూర్తిచేసుకున్న 5,364 ల‌బ్దిదారులకు రూ.53.64 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. సోమ‌వారం జూమ్ మీటింగ్ ద్వారా ల‌బ్దిదారుల చెల్లింపుల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకానికి సంబంధించి పైల‌ట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిర‌మ్మ ఇండ్లను మంజూరు చ...