Hyderabad, జూలై 17 -- యంగ్ హీరో, వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ ప్రస్తుతం 'శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్' చిత్రంతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సూపర్‌ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ శంభాల టీజర్ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే.

శంబాల టీమ్ వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, మేకింగ్ వీడియో ఇలా అన్నీ కూడా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాయి. ఇక తాజాగా నిర్వహించిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) కార్యక్రమంలో 'శంబాల' టీజర్ హాట్ టాపిక్‌గా మారింది.

విదేశాలలో తెలుగు సంస్కృతి, సినిమా సెలెబ్రేట్ చేసే ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025 కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. ఈ క్రమంలో అక్కడ 'శంబాల' టీజర్‌ను ప్రదర్శించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, సమంత, శ్రీలీల...