భారతదేశం, ఏప్రిల్ 27 -- కష్టపడి తనను చదివించి.. ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసిన తండ్రికి ఆ కూతురు బహుమతి ఇవ్వాలనుకుంది. నాన్న కోసం బైక్‌ను కొనుగోలు చేసి.. చెప్పకుండా ఇంటికి వెళ్లి తండ్రిని సర్‌ప్రైజ్ చేయాలనుకుంది. కానీ.. అదే బైక్‌పై సొంతూరుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చనిపోయింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రుకు చెందిన చెడే జనార్దన్‌కు.. కుమార్తె యశస్విని (24), కుమారుడు ఉన్నారు. యశస్విని బాగా చదివి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. యశస్విని తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు హైదరాబాద్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఇటీవల కొనుగోలు చేశారు. తోటి ఉద్యోగి నాగఅచ్యుత్‌కుమార్‌ సాయంతో.. ఆ బ...