భారతదేశం, మే 23 -- వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఏపీ రాజధాని నిర్మాణంపై చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ లేవనెత్తిన ప్రశ్నలు, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి దక్కంచుకోవాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల టెండర్లపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. రాజధాని నిర్మాణ పనుల అంచనాలు భారీగా పెంచడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని జగన్ ఆరోపించారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లించి వాటి ద్వారా ముందే ముడుపులు వసూలు చేస్తున్నారని, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేయడం వెనుక అసలు కారణం ఇదేనని ఆరోపిస్తున్నారు.

అమరావతిలో 50వేల ఎకరాల్లో రాజధాని పనులకు రూ.77వేల కోట్లు ఖర్చు చేస్తూ మరో 50వేల ఎకరాలను...