భారతదేశం, నవంబర్ 21 -- ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు. మరోవైపు చుట్టూ కొండలు. మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు. ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణంలో చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. జర్నీ తేదీలను కూడా ప్రకటించింది.

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ యాత్ర ఉంటుంది. ఈ ప్యాకేజీని నవంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతి శనివారం ఈ యాత్ర ఉండేలా ప్లాన్ చేశారు.ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా లాంచీని సిద్ధం చేశారు.

ఈ లాంచీ ప్రయాణం కోసం పెద్దలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ.1,600గా ఉంది. ఇది సింగిల్ వేకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెళ్లి రావడానికి ఒకేసారి బుక్‌ చేసుకుంటే...