భారతదేశం, మే 3 -- జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా కర్ణాటక ప్రభుత్వంలో గృహనిర్మాణ, మైనారిటీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. పాక్‌తో పోరాడేందుకు ఆత్మాహుతి బాంబుతో ఒంటరిగా వెళ్తానని చెప్పారు.

పాకిస్థాన్ ఎప్పుడూ భారత్‌కు శత్రువేనని జమీర్ అహ్మద్ ఖాన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నాకు అవకాశం ఇస్తే నేనే సరిహద్దుకు వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 'మేమంతా భారతీయులం, హిందుస్తానీలం. పాకిస్థాన్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. పాకిస్థాన్ ఎప్పుడూ మనకు శత్రుదేశమే. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే పాకిస్థాన్‌కు ఆత్మాహుతి బాంబుతో వెళ్తాను.' అని జమీర్ అహ్మద్...