Hyderabad, జూన్ 2 -- ఐపీఎల్‌కు మరో కొత్త విజేత రాబోతున్నారు. ఈసారి ఫైనల్లో ఇప్పటి వరకూ ట్రోఫీ గెలవని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్న విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 3) ఈ మెగా ఫైనల్ జరగనుంది. అయితే ఆదివారం (జూన్ 1) జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ విజయం, ఫైనల్ పై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

రాజమౌళి సోమవారం (జూన్ 2) చేసిన ట్వీట్ లో పంజాబ్ ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఆ టీమ్ ఫైనల్లో తన మరో ఫేవరెట్ అయిన విరాట్ కోహ్లి ఆర్సీబీతో తలపడనుండటంతో ఇద్దరిలో ఎవరు గెలిచినా తనకు హార్ట్ బ్రేక్ తప్పదని జక్కన్న అన్నాడు.

"బుమ్రా, బౌల్ట్ యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించడం ఓ అద్భుతం. ఈ వ్యక్తి ఢిల్లీని ఫైనల్ కు తీసుకెళ్...