భారతదేశం, జనవరి 25 -- నాంపల్లి అగ్రిప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఘటన జరగగా. అప్పట్నుంచి నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్ లో నిమగ్నమయ్యాయి.

రెస్క్యూ ఆపరేషన్ కు దట్టమైన పొగ ఆటంకంగా మారింది. భవనంలో చిక్కున్న ఐదుగురిని గుర్తించేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సెల్లార్‌ అంతా ఫర్నీచర్‌ పరిచి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

భవనం లోపల వాచ్‌మెన్‌ యాదయ్య పిల్లలు అఖిల్‌, ప్రణీత్‌, ఫర్నిచర్‌షాపులో పనిచేస్తున్న హబీబ్‌, ఇంతియాజ్‌, స్వీపర్‌ బేబి ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికీ వీరి ఆచూకీ తెలియలేదు. లోపల దట్టంగా పొగ ఉండటంతో లోపలకు వెళ్లడం కష్టమవుతున్నదని సహాయక బృందాలు చెబుతున్నాయి. భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో. లోపల చిక్కిప...