భారతదేశం, జనవరి 24 -- హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న మంటలు. ఒక్కసారిగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

భవనంలో లోపల ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భవనం పరిసర ప్రాంతవాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు. 8 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది. మరోవైపు రోబో ఫైర్‌ మిషన్‌ ద్వారా రెస్క్యూ కొనసాగుతోంది. సెల్లార్‌ నిండా ఫర్నీచర్‌ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది నెలకొంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....