Hyderabad, మే 15 -- ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు అలరించడానికి ప్రతివారం సిద్ధంగా ఉంటున్నాయి. తాజాగా ఇవాళ మే (15) ఓ కోలీవుడ్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే జాలీ ఓ జింఖానా. నేటి నుంచి తెలుగు భాషలో జాలీ ఓ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవా మెయిన్ లీడ్ రోల్ చేశాడు. అలాగే, హీరోయిన్స్‌గా మడోన్నా స్టెబాస్టియన్, పూజిత పొన్నాడ నటించారు. సీనియర్ హీరోయిన్ (చెప్పవే చిరుగాలి) అభిరామి, పాపులర్ కమెడియన్ యోగిబాబు, రెడిన్ కింగ్స్‌లీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో అలరించారు.

శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన జాలీ ఓ జింఖానా సినిమా డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. నలుగురు ఆడవాళ్లు కలిసి ఓ శవంతో బ్యాంక్ స్కామ్ ఎలా చేశారనే కాన్స...