భారతదేశం, జనవరి 20 -- వీధి కుక్కల సమస్యపై అవగాహన కల్పించే క్రమంలో నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ (Renu Desai) తీవ్రమైన విమర్శలను, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. సోమవారం (జనవరి 19) హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), పిల్లలను ఉద్దేశించి నెటిజన్లు చేసిన కామెంట్స్ ఆమెను తీవ్రంగా బాధించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 20) రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేసింది.

వారణాసి గంగా నదిలో పడవపై ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ రేణు దేశాయ్ ఒక నోట్ రాసింది. "నన్ను రక్షించడానికి నాకు తండ్రి లేరు, తల్లి లేదు, అన్నయ్య లేడు, భర్త కూడా లేరు. నేను చేయని తప్పుకు నాపై ఇంత విషం చిమ్ముతున్నారు. నా బాధను, కన్నీళ్లను ఆ దేవికి, మహాదేవుడికి మాత్రమే చెప్పుకుంటాను...