భారతదేశం, నవంబర్ 2 -- నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే జోగి రమేశ్ ఇంటికి అధికారులు చేరుకోగా. చాలాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసుల పర్యవేక్షణలో ఆయన నివాసం నుంచి తరలించారు.
కొద్దిరోజుల కిందట ఇబ్రహీంపట్నం, ములకలచెరువులలో నకిలీ మద్యం తయారీ డంప్లు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జనార్దన్రావు ఉన్నాడు. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేయగా.. పోలీసులు కస్టడీకి కూడా తీసుకున్నారు. కస్టడీలో ఇచ్చిన వివరాల ఆధారంగా జోగి రమేశ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
జనార్దన్రావు నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఓ వీడియో కూడా కొద్దిరోజుల కిందట విడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.