భారతదేశం, మే 27 -- ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌ సరిహద్దులో.. ఈ నెల 21న ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ అలియాస్‌ బీఆర్‌ దాదా అమరులయ్యారు. ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని.. ఆ పార్టీ దండకారణ్యం ప్రత్యేక జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ ఆరోపించారు.

1.వికల్ప్‌ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అందులో నంబాల కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఒకరి మృతదేహాన్ని తాము తీసుకెళ్లామని వికల్ప్ స్పష్టం చేశారు.

2.నంబాల కేశవరావు అబూజ్‌మడ్‌లో ఉన్నట్లు ఆరు నెలల ముందే పోలీసులకు తెలుసు. లొంగిపోయిన కొందరు మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఆయన్ను లక్ష్యంగా చేసుకొని.. జనవరి, ఫిబ్...