భారతదేశం, మే 18 -- థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో 'కుబేర' ఒకటి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ధనుష్, నాగార్జున మల్టీస్టారర్.. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మంధాన కాంబినేషన్ అంచనాలు పెంచేస్తోంది. ఇక ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అనే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది.

ధనుష్, నాగార్జున 'కుబేర' మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ తో డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ హక్కులు దక్కించుకుందని తెలిసింది. అది కూడా రూ.50 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుందన్నది ట్రేడ్ వర్గాల మాట.

కుబేర మూవీ మొత్త...