Telangana,hyderabad,andhra, మే 8 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు వేసవి వేళ ఎండల తీవ్రత ఉండగా. మరోవైపు వానలు కూడా కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం. దక్షిణతెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా ఉత్తర -దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఇది ఉంది. ఇక నైరుతి రుతుపవనాలు మే 12 నాటికి దక్షిణ అండమాన్ సముద్ర, ఆగ్నేయ బంగాళాఖాతం మరియు నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన ...