Telangana,andhrapradesh, జూన్ 10 -- మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. సగటు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కర్ణాటక మీదుగా మరో ద్రోణి కూడా కొనసాగుతోంది. ఇవే కాకుండా... వాయువ్య బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న ఉత్తర తీర ఒడిశా, దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి.

ఇవాళ తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ...