Hyderabad, మే 9 -- ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ పై ఎదురుదాడి మొదలుపెట్టింది. పహల్గాంలోని ఉగ్రవాద చర్యకు ధీటైన సమాధానం చెబుతోంది. బోర్డర్ వెంబడి కాల్పులు జరుగుతున్నాయి. యుద్ధం ఎంత చిన్నదైనా కూడా దాని ప్రభావం ఆ దేశంలో నివసిస్తున్న సామాన్య ప్రజలపై కచ్చితంగా ఉంటుంది.

మేము నేరుగా యుద్ధంలో పాల్గొనడం లేదు కదా ఇక మనపై ఎందుకు ప్రభావం.. అనుకోవచ్చు. మీకు తెలియకుండానే మీ హృదయం, మనస్సులపై లోతైన అనుభూతిని యుద్ధం కలిగిస్తుంది. మీకు తెలియకుండానే భయం, ఒత్తిడి వంటివి మీలో మొదలైపోతాయి. దీన్నే యుద్ధ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఆంగ్లంలో దీన్ని వార్ సిండ్రోమ్ అని లేదా వార్ ట్రామా సిండ్రోమ్ అని పిలుచుకుంటారు.

దేశంలో యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఒక వ్యక్తిని లోపల నుండి విచ్ఛిన్నం చేసే సిండ్రోమ్ ఇది. దీని గురించి ఆ వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు. ఎంతోమంద...