భారతదేశం, మే 27 -- వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులకు సూచించారు. తెలంగాణ ముప్పు లేదని.. అయినా నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తామని వివరించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి.. కీలక సూచనలు చేశారు.

'కరోనాతో ఇప్పటికైతే ప్రమాదం లేదు. వివిధ రాష్ట్రాల్లో కేసులు కనిపిస్తున్నా.. ఆసుపత్రుల్లో చేరడం లేదు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ.. రోగ నిరోధక శక్తి లేని వారు జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం నమూనాలు పంపాలని సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా' అని చెప్పారు. నమూనాలు పంపాలని డీహెచ్‌ రవీందర్‌ నాయక్‌ను మంత్రి దామోదర ఆదేశించారు.

జ్వరం లేదా చలి

దగ్గు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేద...