భారతదేశం, మే 31 -- దృశ్యం ఫేమ్‌, మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌ జీతూ జోసెఫ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మ‌ల‌యాళ వెబ్‌సిరీస్‌కు రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్‌ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు షో ర‌న్న‌ర్‌గా మాత్ర‌మే జీతూ జోసెఫ్ వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.

రోస్లిన్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌ల‌యాళంలో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ తెలుగు, త‌మిళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌కు సుమేష్ నంద‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌తోనే డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు సుమేష్‌.

రోస్లిన్ వెబ్ సిరీస్‌లో సంజ‌న దీపు, హ‌కీమ్ షా లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. అడ‌వి ...