భారతదేశం, మే 26 -- ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మ వారి నైవేద్యం విరామం కోసం ఇకపై ప్రతి రోజు ఉదయం 11.30 నుండి 1.30 వరకు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో శీనా నాయక్‌ ప్రకటించారు.

దుర్గగుడిలో అమ్మవారికి నైవేద్యాలను సమర్పించే సమయంలో క్యూ లైన్లను ఎక్కడికక్కడ నిలిపి వేస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు, పసి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అదే సమయంలో వీఐపీ దర్శనాల కోసం వస్తుండటంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుండటంతో దర్శనాలను క్రమబద్దీకరిస్తున్నట్టు ప్రకటించారు.

అమ్మవారి దర్శనం కోసం వచ్చే వీఐపీలు ముందస్తు సమాచారం ప్రోటోకాల్‌ విభాగానికి అందించాలని, అన్ని వివరాలతో కూడిన ఫార్మాట్ లో వివరాలు తెలియ చేయాల్సి ఉంటుందని వివరించారు.

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణం లో నిర్మించిన నవగ్రహ మండపం పునః ప్రత...