భారతదేశం, జనవరి 7 -- జనవరి 23 నుండి కడప జిల్లాలోని కొప్పర్తిలో జరగనున్న 'దీని ఇజ్తిమా'కు హాజరయ్యే వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈ ట్రైన్ గురించి మాట్లాడారు. సౌత్ సెంట్రల్ రైల్వే తెలంగాణలోని చర్లపల్లి నుండి తిరుపతి జిల్లాలోని తిరుచానూరు వరకు ఈ ప్రత్యేక రైలును నడుపుతుందని తెలిపారు. రైలు నెం. 07140 చర్లపల్లి-తిరుచానూరు రైలు జనవరి 22న చర్లపల్లిలో బయలుదేరుతుంది. నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు మీదుగా ప్రయాణించి ఉదయం 5.30 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. నంద్యాల నుండి ఈ రైలు కడప మీదుగా తిరుచానూరుకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07141 జనవరి 25న రాత్రి 11.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. తెల్లవారుజామున 3 గంటలకు కడపకు, ఉదయం 6.50 గంటలకు నంద్యాలకు చేరుకుని, చివరకు గుంటూరు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.