భారతదేశం, మే 22 -- ివ్యాంగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గృహ కేటాయింపు విధానంలో దివ్యాంగులకు 4 శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఇది చారిత్రాత్మక, ప్రధాన అడుగుగా గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ బ్రిడ్జి కింద అందుబాటులో ఉన్న వసతిలో వీరికి ఈ రిజర్వేషన్ కల్పించారు.

ఇకపై కేంద్ర ప్రభుత్వ వసతి గృహాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఇది వారికి సౌలభ్యం కల్పించడమే కాకుండా, ప్రభుత్వ సేవల్లో సమానత్వం, గౌరవం, ప్రాప్యత దిశగా ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదానికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

వికలాంగుల హక్కుల(ఆర్‌పీడబ్ల్యుడీ) చట్టం, 2016కు ...