Andhrapradesh,vijayawada, మే 22 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మ్యారేజీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడగా. ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, పెళ్లికార్డు, పెళ్లి ఫొటో అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి ప్రకటన చేశారు.

గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడారు. రేషన్‌ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, పెళ్లికార్డు, పెళ్లి ఫొటో అవసరం లేదని పునరుద్ఘాటించారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి ప...