భారతదేశం, ఏప్రిల్ 27 -- దేశంలోని ఈ వారం వాతావరణ అప్డేట్స్​ ఇచ్చింది ఐఎండీ (భారత వాతావరణశాఖ). మే 1 వరకు పంజాబ్, హరియాణా, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అయితే దిల్లీ-ఎన్​సీఆర్​లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉత్తర్​ప్రదేశ్, పశ్చిమ్​బెంగాల్, బిహార్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

దిల్లీ ఎన్​సీఆర్​లో ఆదివారం ఆకాశం మేఘావృత్తమై ఉంటుంది. వడగాల్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిన మరుసటి రోజే ఈ పరిస్థితులు కనిపించడం ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చే విషయం.

దిల్లీలో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని, ఆదివారం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటుందని, ఇ...